భారత దేశంలో చాలామంది ముసలివాళ్లు దిక్కులేని స్థితిలో బతుకుతున్నారు.పొట్టకూటి కోసం చెత్త వేరుకుంటూ కొందరు.
యాచిస్తూ మరి కొందరు మనకు కనిపిస్తూనే ఉంటారు.అయితే తాజాగా ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కుంటున్న ఓ వృద్ధురాలికి మంచి లైఫ్ ప్రసాదించాడో వ్లాగర్.
పారేసిన బట్టలను ఏరుకుని బతుకుతున్న 75 ఏళ్ల బామ్మ మారడాన్ని వివరిస్తున్న ఓ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ షేర్ చేశారు.మానవత్వం అంటే ఇదే అంటూ ఆ ఆఫీసర్ పేర్కొన్నారు.
ఈ వీడియోకి ఇప్పటికే 3 లక్షల 46 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో తరుణ్ మిశ్రా అనే వ్లాగర్ డంపింగ్ యార్డ్ నుంచి పాత బట్టలను ఏరుకుంటున్న ఒక వృద్ధురాలి వద్దకు వెళ్లడం చూడవచ్చు.
అనంతరం అతను ఆమెతో మాట్లాడుతూ మీరు ఏం చేస్తున్నారు అమ్మ అని ప్రశ్నించాడు.పాత దుస్తుల ముక్కలను ఏరుకుని వాటిని విక్రయిస్తూ పొట్ట పోషించుకుంటున్నానని ఆమె చెప్పింది.
ఆమె పరిస్థితి చూసి బాగా చలించిపోయిన తరుణ్ ఆ తర్వాత టీ తాగించడం చూడవచ్చు.ఆపై బియ్యం, పప్పులు, ఉప్పులు అన్నీ కొనిచ్చాడు.
వాటిని ఆమె ఇంట్లో పెట్టి మరీ సంతోష పెట్టాడు.
అనంతరం ఆమె చేత కూరగాయల వ్యాపారం పెట్టించేందుకు అవసరమైన వెయింగ్ మెషిన్, కూరగాయల బండి, తాజా కూరగాయలను కొనిచ్చాడు.ఆవిధంగా మానవత్వంతో ఒక బామ్మకు చక్కటి జీవితాన్ని ప్రసాదించాడు.దాంతో ఆమె ఎమోషనలై అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించింది.
నెటిజనులు కూడా ‘నువ్వు దేవుడివి భయ్యా, గాడ్ బ్లెస్స్ యు బ్రదర్’ అని కామెంట్లు చేస్తున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.